BREAKING
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ఆశా భోస్లే జన్మదినం సందర్భంగా ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన 'ఆశా ఫరెవర్' గీతం ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ. సీఎం యాదవ్ యూఏఈ పర్యటన విజయవంతం భారత్, శ్రీలంకలు నాగరికత పరంగా కవలలు ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని 'సేవా సంకల్ప అభియాన్' బ్రిక్స్ సదస్సు 2026కు ముందు పోస్టర్లు, దీపాలతో ముస్తాబైన ఢిల్లీ రాష్ట్రపతి, ప్రధానులను కలవనున్న ఆగ ఖాన్ V 2 శాతం పెరిగిన ముడి చమురు ధరలు ప్రాథమిక స్థాయిలో సున్నాకి చేరిన డ్రాపౌట్ రేటు దేశవ్యాప్తంగా ఎనిమిది ఆపరేషన్లలో 740 కిలోల మాదకద్రవ్యాల స్వాధీనం నిబంధనలు పాటించనందుకు 15 విదేశీ క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లకు FIU-India నోటీసులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న బ్రిక్స్ బ్రిక్స్ ప్రకటనపై రష్యా ఆశాభావం BRICS సదస్సు వేళ యూపీ, పొరుగు రాష్ట్రాల శిక్షణా కేంద్రాల్లో విమాన కార్యకలాపాలపై DGCA ఆంక్షలు

2 శాతం పెరిగిన ముడి చమురు ధరలు

Select Suryaa Now
2 శాతం పెరిగిన ముడి చమురు ధరలు

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య తీవ్రతరమవుతున్న సైనిక దాడులు గల్ఫ్ ప్రాంతంలో చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం వరుసగా నాలుగో సెషన్‌లోనూ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.79 శాతం ($1.76) పెరిగి $100 సమీపానికి చేరగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 1.88 శాతం ($1.75) పెరిగి బ్యారెల్‌కు $94.78 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఆరు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలతో ఆగస్టు ఆరంభం నుంచి బ్రెంట్ ధరలు దాదాపు 20 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాల్లోని చమురు కేంద్రాలపై యెమెన్‌కు చెందిన హౌతీ దళాలు దాడి చేయడం, దానికి ప్రతిగా సౌదీ దళాలు వైమానిక దాడులు జరపడం ఈ తీవ్రతకు కారణమైంది. మరోవైపు, ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా డిస్ట్రాయర్లు, సైనిక స్థావరంపై క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ (IRGC) ప్రకటించింది. కాగా, తమ నౌకలపై దాడులకు తెబడితే ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేస్తామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.