పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ వాహనం చోరీ.. నిందితుడి అరెస్ట్
01 సూర్య కరీంనగర్ ప్రతినిధి:
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి ప్రభుత్వ పెట్రోలింగ్ ఇన్నోవా క్రిస్టా వాహనం (TS-09-PA-3794) అపహరించిన మొహమ్మద్ అజాజ్ (28)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా భార్య దూరం కావడంతో మానసిక ఆందోళనలో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వాహనం తాళం చెవి అందుబాటులో ఉంచినందుకు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ డ్రైవర్పై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు.