అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి (PS) రాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి వకిటి శ్రీహరి, అప్రమత్తమై ఆయనకు సమయస్ఫూర్తితో సీపీఆర్ (CPR) చేసి ప్రాణాపాయం నుండి కాపాడేందుకు ప్రయత్నించారు.
సకాలంలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, అసెంబ్లీలోని వైద్య సిబ్బంది సహాయంతో రాజును వెంటనే అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో స్పందించి సీపీఆర్ చేసిన మంత్రి వకిటి శ్రీహరి సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని పలువురు నాయకులు, అధికారులు అభినందించారు.