స్పీకర్ ఆత్మగౌరవంపై దాడి చేస్తే సహించేది లేదు
తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్
మోమిన్పేట్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 8): తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మోమిన్పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్ అన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.తాత మధుపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మన్నె శంకర్ యాదవ్ స్పష్టం చేశారు.