స్పీకర్ ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు
తాత మధు పై కఠిన చర్యలు తీసుకోవాలి
గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య
వికారాబాద్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 08):
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకుడు,ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకరమైన,అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.రాజకీయ విమర్శలు హద్దులు దాటరాదని,కానీ వ్యక్తి గత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ గారిని అవమానించేలా మాట్లాడటం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యగా తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారన్నారు. తాత మధు పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని,ఎమ్మెల్సీ తాత మధును శాసన మండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత మధు సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆత్మగౌరవాన్ని కించపరిచే మాటలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని అన్నారు.