telanagana
లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్
Telanagana
07 Sep 2026
31 views
By సూర్య ప్రతినిధి
Updated : 07 Sep 2026 22:28 IST
Select Suryaa Now
ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజురాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్లను ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వివరాలలోకి వెళితే... హుజురాబాద్ సబ్ జైలు డిప్యూటి జైలర్ నాంపల్లి దేవేందర్ (46) జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామకు మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కాగా బాధితుడు ఈ విషయాన్ని ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఏసిబి డిఎస్పి గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో, ఇండియన్ ఆయిల్ సబ్ జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ (30) ద్వారా డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ. 10,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ వద్ద నుంచి రసాయన పరీక్షల అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటి జైలర్ దేవేందర్, బంక్ ఆపరేటర్ హరీశ్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.