ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో జరిగిన సమావేశం ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే ముగిసింది. కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి.
అజెండా లేకుండానే సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరైనట్లు సమాచారం.
తెలంగాణలోని 30–50 ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం తెలిపింది.
శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ డిమాండ్ చేసింది.
గోదావరి బేసిన్లో నీటి లభ్యతను సమగ్రంగా లెక్కించాలని ఏపీ కోరింది.
ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాల ఆధారంగా CWC తదుపరి సమావేశానికి అజెండాను ఖరారు చేయనుంది.
మరో 10–15 రోజుల్లో ఇరు రాష్ట్రాల అధికారులతో మరోసారి CWC సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
మొత్తానికి.. ఢిల్లీలో జరిగిన చర్చల్లో తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు పరిష్కారం లభించలేదు. వచ్చే సమావేశంలో కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.