BREAKING
మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ ఢిల్లీలో భవనాల భద్రత, పీజీ నిబంధనలపై ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు సమీక్ష

ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సులభతరం చేసేందుకే వచ్చిందని, అయితే ఇప్పుడు ఏఐ రూపంలో అది మానవాళి ఉనికికే సవాల్ విసురుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మానవునికి ప్రధానంగా శారీరక శక్తి, మేధస్సు అనే రెండు బలాల బలం ఉంటుందని వర్మ పేర్కొన్నారు. పారిశ్రామిక విప్లవం సమయంలో యంత్రాలు మనిషి శారీరక శ్రమను ఎలా తగ్గించాయో, ఇప్పుడు ఏఐ అంతకంటే వేగంగా మనిషి మేధోపరమైన పనులను ఆటోమేట్ చేస్తోందని హెచ్చరించారు. కంటెంట్ రైటింగ్, కోడింగ్, డిజైనింగ్, డేటా అనాలిసిస్ వంటి మెదడుతో చేసే పనులను కూడా ఏఐ క్షణాల్లో చేసేస్తోందని, ఇది భవిష్యత్తులో ఉద్యోగాల కోతకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగైపోవని, ఏఐని సమర్థవంతంగా ఉపయోగించుకునే నైపుణ్యం ఉన్నవారి చేతుల్లోకే ఉద్యోగాలు వెళ్లిపోతాయని వర్మ స్పష్టం చేశారు. పాత పద్ధతులనే నమ్ముకుంటూ ముందుకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మనిషి ఎప్పుడూ శ్రమ తగ్గించుకోవాలని కోరుకుంటాడని, ఇప్పుడు ఏఐ ఆ కోరికను నిజం చేస్తోందని, కానీ ఆ కోరికనే మానవ జాతికి మునుముందు పెద్ద సమస్యగా మారుతుందని ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.