వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు
పామూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలలో ప్రసిద్ధి చెందిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, సోదరులు తూర్పు కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్ దారపనేని జనార్దన్ రావు దంపతులు, దారపనేని కృష్ణ , దారపనేని వారి మేనల్లుడు తిరివీధీ చంద్రమోహన్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనునిత్యం దర్శనా నిమిత్తం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంటూ భక్తులు స్వామివారి కృపకు పాత్రులవుతున్నారని పేర్కొన్నారు. దేవస్థానం కమిటీ సభ్యులు రవి స్వామి పట్టు వస్త్రంతో దారపనేని సోదరులను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాలను అందజేశారు. ధనెంకుల యోగేంద్ర, పెద్దన్న, నరసింహారావు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.