BREAKING
ఏపీలో పోలీస్ అధికారి దురుసు ప్రవర్తన.. వృద్ధురాలిపై బూతులతో విరుచుకుపడ్డ వీడియో వైరల్.. సస్పెండ్ చేయాలని ప్రజాగ్రహం శ్రీవారిమెట్టు మార్గంలో కారు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న వాహనం.. హైదరాబాద్ యాత్రికులకు తప్పిన పెను ముప్పు తిరుపతిలో రౌడీషీటర్ వీరంగం.. హారన్ కొట్టాడని ట్రావెల్స్ మేనేజర్‌పై దాడి.. ఫోన్ ధ్వంసం చేసి బంగారు చైన్ చోరీ ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. బస్సులో మర్చిపోయిన రూ. 3 లక్షల నగదును ప్రయాణికుడికి అప్పగించిన కండక్టర్, డ్రైవర్ సూర్యాపేటలో సంచలనం.. వివాహితతో అక్రమ సంబంధం, భర్త హత్యకు కుట్ర ఆరోపణలు.. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై చర్యలకు బాధితుడి ఆందోళన వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. రిపోర్టులు లేవంటూ గర్భిణికి నిరాకరణ.. అంబులెన్స్‌లోనే ప్రసవం నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి సభకు వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా? లేడీ సూపర్‌స్టార్ మౌనం వెనుక అసలు నిజం ఏంటి? భోగాపురంలో అమానుషం.. బైక్ రిపేర్ డబ్బుల కోసం యువకుడి మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లిన వైనం.. ఐదుగురు అరెస్ట్ మహేంద్రగిరి వారాహి’ పెద్ద హిట్‌ కాబోతోంది: అఖిల్ అక్కినేని! అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న అమెజాన్ కార్గో ఫ్లైట్.. ఐదుగురు దుర్మరణం ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఆకట్టుకున్న తారల సందడి! ఆర్టీసీ–మెట్రో ఉమ్మడి పాస్.. ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆసక్తి! తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. మరో రెండు రోజులు వానలు! సెప్టెంబర్ 7న వెండి ధరలు.. తెలంగాణ, ఏపీలో గ్రాము రేట్లు ఇవే!

తిరుపతిలో రౌడీషీటర్ వీరంగం.. హారన్ కొట్టాడని ట్రావెల్స్ మేనేజర్‌పై దాడి.. ఫోన్ ధ్వంసం చేసి బంగారు చైన్ చోరీ

Select Suryaa Now
తిరుపతిలో రౌడీషీటర్ వీరంగం.. హారన్ కొట్టాడని ట్రావెల్స్ మేనేజర్‌పై దాడి.. ఫోన్ ధ్వంసం చేసి బంగారు చైన్ చోరీ

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పట్టపగలే రౌడీమూకలు బరితెగించి వీరంగం సృష్టిస్తున్నాయి. రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న వారిని హెచ్చరిస్తూ హారన్ కొట్టాడన్న చిన్న కారణానికే ఒక ట్రావెల్స్ మేనేజర్‌పై రౌడీషీటర్ దాడికి తెగబడిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. బాధితుడిపై విచక్షణారహితంగా దాష్టీకానికి పాల్పడి, మొబైల్ ఫోన్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేయడమే కాకుండా, మెడలోని తొమ్మిది గ్రాముల బంగారు చైన్‌ను లాక్కుని చంపేస్తానంటూ ప్రాణహాని బెదిరింపులకు గురిచేశారు. ఈ అరాచక ఘటనపై బాధితుడు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. సుండుపల్లి మండలం మంచిరెడ్డిపల్లికి చెందిన పి. చంద్రమోహన్ పుదీపట్ల ప్రాంతంలోని కృష్ణ ట్రావెల్స్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల నాలుగో తేదీన ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రయాణిస్తుండగా, చెర్లోపల్లి వద్ద ఉన్న ఆయన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ సమీపంలో కొందరు యువకులు రోడ్డుపై ఇష్టారాజ్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకరంగా వెళ్తుండటం గమనించారు. ప్రమాదం జరగకుండా ఉండేందుకు చంద్రమోహన్ తన వాహనం హారన్ మోగించడంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ దుండగులు వాహనాన్ని అడ్డగించి ఆయనతో వాగ్వాదానికి దిగారు.

ఆ గుంపులోని ఒక దుండగుడు తన పేరు అజీమ్ అని, తానొక రౌడీషీటర్‌నంటూ గర్వంగా చెప్పుకుంటూ చంద్రమోహన్‌పై దాడికి దిగాడు. తీవ్రంగా కొట్టడమే కాకుండా బాధితుడి చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను లాక్కొని నేలకేసి పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా బాధితుడి మెడలో ఉన్న తొమ్మిది గ్రాముల బంగారు గొలుసును బలవంతంగా తెంచుకుని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితుడు చంద్రమోహన్ వెంటనే తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అజీమ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.