BREAKING
మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ ఢిల్లీలో భవనాల భద్రత, పీజీ నిబంధనలపై ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు సమీక్ష

బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్

Select Suryaa Now
బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్

విజయవాడలోని కలగ లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గత నెల 16న ముత్తు పాండియన్‌ అనే వ్యక్తి లాడ్జిలో హత్యకు గురయ్యాడు.

చెన్నై నుంచి బరంపురం వెళ్తున్న ముత్తు పాండియన్‌.. తన స్నేహితులతో కలిసి విజయవాడలోని లాడ్జిలో బస చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడి భార్యను పాండియన్‌ దూషించడంతో వివాదం తలెత్తింది. దీంతో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది.

వివాదం తీవ్రం కావడంతో ముగ్గురు వ్యక్తులు కత్తులతో పాండియన్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితులు చెన్నైకి పరారయ్యారు.

కేసును దర్యాప్తు చేసిన బెజవాడ పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.