ఎస్ ఐ ఆర్ తో సతమతం వద్దు
ఎస్ఐఆర్ తో సతమతం వద్దు…
సర్పంచ్ దీపిక పాపిరెడ్డి
పూడూర్,మేజర్ న్యూస్(సెప్టెంబర్ 7):ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా సోమవారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ దీపిక పాపిరెడ్డి అధ్యక్షతన ఎస్ఐఆర్ లో నెలకొన్న అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తహసీల్దార్ విజయ్ కుమార్ హాజరై ధృవపత్రాలు పరిశీలించి మాట్లాడారు..ఎస్ఐఆర్ లో తండ్రి పేరు,వయస్సు,ఇంటి పేరు,కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా తప్పులను సరిచేస్తున్నట్లు తెలిపారు.అంతరం సర్పంచ్ దీపిక పాపిరెడ్డి మాట్లాడుతూ..అధికారులు అడిగిన ధ్రువ పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాఫర్ గ్రామస్థులు గోపాల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.