కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం
నర్సాపూర్లో కాలువ పనుల పరిశీలనలో హరీష్ రావు
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టు పనులపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డితో కలిసి ఆయన నర్సాపూర్ ప్రాంతంలో నిలిచిపోయిన మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి కాలువ పనులు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. కాలువ నిర్మాణాలు ఆగిపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణను, మిగిలిన పనులను పట్టించుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు.