BREAKING
కీలక బిల్లును ఆమోదించిన గోవా అసెంబ్లీ గోవాలో బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల బీభత్సం: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ! త్రిపుర సేంద్రియ బియ్యానికి అంతర్జాతీయ గుర్తింపు 2027 వరకు 'ఎల్ నినో' తీవ్రత భారత 10 సంవత్సరాల రక్షణ దౌత్య రోడ్‌మ్యాప్ విశాఖపట్నం వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు:పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఆగస్టులో పుంజుకున్న భారత సేవల రంగం 'గజ' అల్లకల్లోలంగా సాంగ్ లాంచ్: కమర్షియల్ హంగులతో పాటు బలమైన సందేశం ఉంటుందన్న చిత్ర యూనిట్ | గ్లోబల్ ఆటో రంగంలో భారత్ సరికొత్త రికార్డులు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు. నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన గాంధారీ X రివ్యూ: నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన.. తాప్సీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే? బెంగళూరులో 'ఏరో ఇండియా 2027'

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు.

Select Suryaa Now
కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు.

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు.
అమీన్‌పూర్‌లో కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు


అమీన్ పూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమీన్‌పూర్‌లో కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమీన్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అమీన్‌పూర్‌, బీరంగూడ డివిజన్లకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, స్వీట్లు పంపిణీ చేసారు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.