100 రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ.. 1,000 రోజుల్లో ప్రజలను నట్టేట ముంచారు: మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి..
కుల్కచర్ల: 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1,000 రోజులు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. 1,000 రోజులు అవుతున్నా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 420 మోసాలపై బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తోందని తెలిపారు.
అబద్ధాలు, వంచనలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, పేదల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.