BREAKING
గోవాలో బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల బీభత్సం: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ! త్రిపుర సేంద్రియ బియ్యానికి అంతర్జాతీయ గుర్తింపు 2027 వరకు 'ఎల్ నినో' తీవ్రత భారత 10 సంవత్సరాల రక్షణ దౌత్య రోడ్‌మ్యాప్ విశాఖపట్నం వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు:పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఆగస్టులో పుంజుకున్న భారత సేవల రంగం 'గజ' అల్లకల్లోలంగా సాంగ్ లాంచ్: కమర్షియల్ హంగులతో పాటు బలమైన సందేశం ఉంటుందన్న చిత్ర యూనిట్ | గ్లోబల్ ఆటో రంగంలో భారత్ సరికొత్త రికార్డులు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు. నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన గాంధారీ X రివ్యూ: నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన.. తాప్సీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే? బెంగళూరులో 'ఏరో ఇండియా 2027' 20 వేల ఇళ్ల పునర్నిర్మాణం తప్పనిసరి, కొనసాగుతున్న గాలింపు

గ్లోబల్ ఆటో రంగంలో భారత్ సరికొత్త రికార్డులు

Select Suryaa Now
గ్లోబల్ ఆటో రంగంలో భారత్ సరికొత్త రికార్డులు

సియామ్ (SIAM) సదస్సులో ప్రధాని మోదీ సందేశం
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ పరిశ్రమ తన అంతర్జాతీయ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి అత్యంత పటిష్టమైన స్థితిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తయారీ సామర్థ్యాలు పుంజుకోవడం, వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు) గ్లోబల్ మార్కెట్లలో మన వాహన రంగానికి విస్తృత అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.

66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడిన ముఖ్యాంశాలు...ఇంధన సామర్థ్యం, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం, ఆధునిక తయారీ విధానాల వైపు భారత ఆటో పరిశ్రమ వేగంగా రూపాంతరం చెందుతోందని కొనియాడారు.

వేగంగా విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ వ్యయం తగ్గడం వల్ల భారత తయారీ రంగం అంతర్జాతీయంగా మరింత పోటీతత్వాన్ని సాధిస్తోందని పేర్కొన్నారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణతో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకం వేగంగా పెరుగుతోందని, ఇది స్వచ్ఛమైన రవాణా వ్యవస్థ వైపు గొప్ప మార్పు అని ప్రధాని స్పష్టం చేశారు. 'మేక్ ఇన్ ఇండియా', ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలతో పాటు అనవసర నిబంధనల తొలగింపు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పరిశ్రమ ఉత్పాదక సామర్థ్యానికి కొత్త ఊపునిచ్చాయని తెలిపారు.

భారతదేశ తదుపరి తరం మొబిలిటీ లక్ష్యాలను చేరుకోవడంలో, 'వికసిత్ భారత్' నిర్మాణంలో ఆటోమోటివ్ సామర్థ్యాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సియామ్ (SIAM) మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిరంతర ఆవిష్కరణలు కొనసాగిస్తూ, పచ్చని, ఆత్మనిర్భర భవిష్యత్తు వైపు రవాణా రంగాన్ని నడిపించాలని పరిశ్రమ వర్గాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.