BREAKING
కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు. నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన గాంధారీ X రివ్యూ: నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన.. తాప్సీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే? బెంగళూరులో 'ఏరో ఇండియా 2027' 20 వేల ఇళ్ల పునర్నిర్మాణం తప్పనిసరి, కొనసాగుతున్న గాలింపు జాతీయ భద్రతకు ఇంధన స్వయం సమృద్ధి అత్యంత కీలకం న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసిన 18వ 'బ్రిక్స్ ఐపీ' సమావేశం సెప్టెంబర్ మొదటి వారాంతంలో డిజిటల్ ప్లాట్ఫామ్లపై పలు ఆసక్తికరమైన సినిమాలు నా బర్తరఫ్‌ చెల్లదు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు ప్రపంచ వాణిజ్యంలో భారత్ దూకుడు కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం విజయ్ మంచి సీఎం కావాలి.. కాంగ్రెస్ అండగా ఉంటుంది మంత్రివర్గం నుంచి కొండా సురేఖ తొలగింపు! 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ.. 1,000 రోజుల్లో ప్రజలను నట్టేట ముంచారు: మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి.. చిన్నారెడ్డిపైనా వేటు *తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల్లో కీలక మార్పులు *చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మి.. *మహిళా కమిషన్‌కు నేరెళ్ల శారద.. కుడాకు గుండు సుధారాణి

ప్రపంచ వాణిజ్యంలో భారత్ దూకుడు

Select Suryaa Now
ప్రపంచ వాణిజ్యంలో భారత్ దూకుడు

FTAలతో 75 శాతం గ్లోబల్ మార్కెట్‌పై దృష్టి
న్యూఢిల్లీ: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా ప్రపంచ మార్కెట్లలో భారత వస్తువులకు ప్రాధాన్యతను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కుదుర్చుకోబోయే కొత్త ఒప్పందాలతో అంతర్జాతీయ వాణిజ్యంలో దేశానికి భారీ ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. దాదాపు 60 ట్రిలియన్ డాలర్ల జీడీపీ పరిధి కలిగిన తొమ్మిది రకాల FTAలతో ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండు వంతుల భాగస్వామ్యానికి భారత్‌కు ప్రాధాన్యతా ప్రాప్యత లభిస్తోంది.

కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసూర్, SACU దేశాల కూటమి, GCC, మరియు ఇజ్రాయెల్‌లతో రాబోయే రెండు సంవత్సరాలలో కొత్త FTAలు కుదుర్చుకునేందుకు కసరత్తు వేగవంతమైంది.
ఆసియాన్, దక్షిణ కొరియా, జపాన్‌లతో ఉన్న ఒప్పందాల పునఃసమీక్ష ద్వారా మన పోటీదారుల కంటే మెరుగైన స్థానాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఈ ప్రాజెక్టులు, సమీక్షలు పూర్తయితే గ్లోబల్ మార్కెట్‌లో దాదాపు 75 శాతం భాగస్వామ్యంలో భారత్‌ అత్యల్ప సుంకాలతో పోటీపడే అవకాశం లభిస్తుంది.
గతంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతులు చేసే సమయంలో భారత్ అధిక సుంకాలు చెల్లించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని, ప్రపంచ దేశాలతో సమానంగా లేదా అంతకంటే తక్కువ సుంకాలతో మన వ్యాపారం సాగుతుందని స్పష్టం చేశారు.

అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లలో మన ఉత్పత్తులకు అన్ని విధాలా అవకాశాలు దక్కాయని, ఇక మిగిలిందల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గ్లోబల్ ఎగుమతుల్లో సత్తా చాటడమేనని మంత్రి పిలుపునిచ్చారు.