భారత్-కెనడా మధ్య బలమైన ఆర్థిక భాగస్వామ్యం
టొరంటో విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
టొరంటో (కెనడా): ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల వేళ కెనడా, భారతదేశాల మధ్య సన్నిహిత ఆర్థిక సహకారం మరింత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కెనడా ఆర్థిక, జాతీయ రెవెన్యూ మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపేన్తో కలిసి టొరంటోలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు.
ప్రస్తుతం ప్రపంచం ఒక ప్రగాఢమైన పరివర్తనకు లోనవుతోందని, ప్రతిచోటా తీవ్ర అనిశ్చితి నెలకొని ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భౌగోళిక, ఆర్థిక వాస్తవాలు నిరంతరం మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితుల్లో భారత్, కెనడా రెండు దేశాల్లోనూ పటిష్టమైన, సుస్థిరమైన మరియు సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవడానికి రెండు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇరు దేశాల అధిపతులు ద్వైపాక్షిక సంబంధాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించారని, ఇది భారత్-కెనడా సంబంధాలకు కొత్త ఊపును, వ్యూహాత్మక దిశను అందించిందని వెల్లడించారు.