BREAKING
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? అన్నాచెల్లెళ్ల ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ భారత్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం నేపాల్ వరద బాధితుల కోసం కాశీ దశశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, హారతి 'ప్రో గోవిందా లీగ్' ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలి యువత సంకల్పంతోనే 'వికసిత్ భారత్' రక్షా బంధన్ వేళ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత సరిహద్దుల్లో ముందస్తు రాఖీ సంబరాలు ఆర్మీ 'సప్త శక్తి కమాండ్'ను సందర్శించిన ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ భారత్-కెనడా మధ్య బలమైన ఆర్థిక భాగస్వామ్యం బెంగళూరు NLSIU వార్షిక స్నాతకోత్సవం రద్దు పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువులు మృతి! యూట్యూబ్‌లో ‘సీటి చీర’ మాస్ జాతర.. పెళ్లిళ్లు, దావత్‌లలో ఇక ఈ పాటే డీజే దుమ్ము! టాక్సిక్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశ్ మూవీ.. వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు వచ్చాయంటే? తెలంగాణలో Grain Silos అత్యాధునిక శైలిలో ధాన్యం నిల్వ: మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై ఢిల్లీలో కీలక భేటీ: సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం

బెంగళూరు NLSIU వార్షిక స్నాతకోత్సవం రద్దు

Select Suryaa Now
బెంగళూరు NLSIU వార్షిక స్నాతకోత్సవం రద్దు

విద్యార్థుల నిరసనే కారణమా?
బెంగళూరు: ప్రసిద్ధ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) తన 34వ వార్షిక స్నాతకోత్సవ (కాన్వొకేషన్) కార్యక్రమాన్ని సడన్‌గా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ యాజమాన్యం అధికారికంగా తెలిపినప్పటికీ, విద్యార్థుల నుంచి వ్యక్తమైన తీవ్ర నిరసనే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వర్సిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమవ్వడం, వివాదం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉండటంతో యాజమాన్యం స్నాతకోత్సవాన్ని వాయిదా వేయక తప్పలేదు.

"కొన్ని అనివార్య కారణాల వల్ల 34వ వార్షిక స్నాతకోత్సవాన్ని రద్దు చేస్తున్నాం" అని NLSIU ఓ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, అసలు కారణం విద్యార్థుల నిరసన కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన లా వర్సిటీ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది.