BREAKING
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? అన్నాచెల్లెళ్ల ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ భారత్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం నేపాల్ వరద బాధితుల కోసం కాశీ దశశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, హారతి 'ప్రో గోవిందా లీగ్' ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలి యువత సంకల్పంతోనే 'వికసిత్ భారత్' రక్షా బంధన్ వేళ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత సరిహద్దుల్లో ముందస్తు రాఖీ సంబరాలు ఆర్మీ 'సప్త శక్తి కమాండ్'ను సందర్శించిన ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ భారత్-కెనడా మధ్య బలమైన ఆర్థిక భాగస్వామ్యం బెంగళూరు NLSIU వార్షిక స్నాతకోత్సవం రద్దు పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువులు మృతి! యూట్యూబ్‌లో ‘సీటి చీర’ మాస్ జాతర.. పెళ్లిళ్లు, దావత్‌లలో ఇక ఈ పాటే డీజే దుమ్ము! టాక్సిక్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశ్ మూవీ.. వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు వచ్చాయంటే? తెలంగాణలో Grain Silos అత్యాధునిక శైలిలో ధాన్యం నిల్వ: మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై ఢిల్లీలో కీలక భేటీ: సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం

భారత్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

Select Suryaa Now
భారత్‌ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

2036 ఒలింపిక్స్ బిడ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష
అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను హోం మంత్రి 'X' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. 2036లో జరగబోయే ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం భారతదేశం సమర్పించనున్న ప్రతిష్టాత్మక బిడ్ (అభ్యర్థన) సిద్ధం చేసే ప్రక్రియపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఒలింపిక్స్‌తో పాటు 2029లో జరగనున్న 'పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్', అలాగే 2030 'కామన్వెల్త్ గేమ్స్' నిర్వహణకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై సమీక్ష చేపట్టారు.భారత్‌లో ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, వసతులు పెంపొందించడం ద్వారా దేశాన్ని అంతర్జాతీయ క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు.