బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి
బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి
పామూరు మేజర్ న్యూస్ :
పాూరు మండలంలోని వగ్గంపల్లి గ్రామంలో రైతులు సాగు చేసిన బత్తాయి తోటలను డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట పరిస్థితిని తెలుసుకున్నారు.బత్తాయి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తోటల్లో కాయలు లేనప్పుడు మంచి ధరలు ఉంటున్నాయని, పంట చేతికొచ్చే సమయంలో మాత్రం ధరలు భారీగా పడిపోతున్నాయని తెలిపారు. పెట్టుబడులు పెరిగిపోతున్నా సరైన ధర లేక నష్టపోతున్నామని డాక్టర్ మల్లికార్జున రెడ్డికి వివరించారు. రైతుల సమస్యలను ఆయన ఆసక్తిగా విని, పంట పరిస్థితిని పరిశీలించారు.