పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిధి
పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయనిధి
ప్రజల సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం.
ప్రజా ఆరోగ్యానికి చంద్రబాబు పెద్ద పీట.
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మేజర్ న్యూస్ : పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిదని, ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ: 22,57, 771 సీఎం సహాయనిధిచెక్కులను లబ్ధిదారులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు.వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దర్శి నియోజకవర్గానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ: 22,57, 771 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం దర్శి టిడిపి కార్యాలయం నందు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అందజేశాను.ఆపదలో ఉన్న ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను అని గొట్టిపాటి లక్ష్మీఅన్నారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు,
దర్శి, తాళ్లూరు, కురిచేడు మండలాల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, మేడగం వెంకటేశ్వర్ రెడ్డి, పిడతలు నేమిలయ్య, దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు చిన్నా నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.