నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి.
నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి.
దివ్యాంగుడికి తక్షణమే ట్రై సైకిల్ పంపిణీ.
దర్శి, మేజర్ న్యూస్: బొట్లపాలెం గ్రామంలో ఈ నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన చిరంజీవి తమ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి వివరించి, "మా బాబుకి ఒక ట్రై సైకిల్ కావాలని విన్నవించారు.బాధితుడి పరిస్థితిపై తక్షణమే స్పందించినడాక్టర్ లక్ష్మి ఆదేశాల మేరకు వేగంగా చర్యలు తీసుకుని బాబుకి నూతన ట్రై సైకిల్ను అందచేశారు.తమ పిలుపునకు వెంటనే స్పందించి సైకిల్ ఇప్పించినందుకు గాను, చిరంజీవి గారి కుటుంబ సభ్యులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.