గంగా తెప్పోత్సవ శోభాయాత్రను విజయవంతం చేయాలి : ఖన్నా గంగపుత్ర
హైదరాబాద్: తెలంగాణ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ గంగా తెప్పోత్సవ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర తెలిపారు
ఖైరతాబాద్ ఏడు గుళ్ల నుంచి గంగ తెప్ప పల్లకి ఊరేగింపు ప్రారంభమై హుస్సేన్ సాగర్ గంగమ్మ దేవాలయం వరకు భారీ శోభాయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు గంగపుత్రుల ఐక్యతను చాటిచెప్పే ఈ కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
గంగమ్మ తల్లి ఆశీస్సులతో గంగపుత్రుల ఐక్యతను చాటుదాం అని రాజేష్ ఖన్నా గంగపుత్ర కోరారు