థియేటర్లలో పూనకాలే.. 'ది పారడైజ్' #Yeshanagula సాంగ్పై కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
'ది పారడైజ్' చిత్రంలోని 'యేషనగుల' లిరికల్ సాంగ్లో చూపించని 45 సెకన్ల మాస్ బిట్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని కొరియోగ్రాఫర్ ఆట సందీప్ వెల్లడించారు
సూర్య న్యూస్ డెస్క్ :'ది పారడైజ్' చిత్రం నుంచి విడుదలైన సరికొత్త గీతం "యేషనగుల" (#Yeshanagula) ప్రస్తుతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు వస్తున్న స్పందనపై ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
లిరికల్ వీడియోలో లేని ఆ 45 సెకన్ల సర్ ప్రైజ్!
ఈ పాట మొత్తం నిడివి 3 నిమిషాల 45 సెకన్లు ఉండగా, ప్రస్తుతం విడుదలైన లిరికల్ వీడియోలో కేవలం 3 నిమిషాలు మాత్రమే పొందుపరిచినట్లు సందీప్ మాస్టర్ తెలిపారు. మిగిలిన 45 సెకన్ల హై-వోల్టేజ్ మాస్ బిట్ను కేవలం వెండితెరపైనే వీక్షించేలా చిత్ర బృందం ప్రత్యేకంగా ప్లాన్ చేసిందని ఆయన స్పష్టం చేశారు.
https://youtu.be/JqFzhcWo3EU?si=8swntfqEPonwTQYN
థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ
ఆ అన్రిలీజ్డ్ 45 సెకన్ల బిట్ గురించి మాట్లాడుతూ.. "థియేటర్లలో ఆ బిట్ ప్రదర్శితమయ్యే సమయంలో ప్రేక్షకులు తమ సీట్లలో కూర్చోలేరు. ఆ బీట్కు ప్రతి ఒక్కరూ లేచి చిందేసేలా కొరియోగ్రఫీ డిజైన్ చేశాం. వెండితెరపై ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం" అని సందీప్ మాస్టర్ ధీమా వ్యక్తం చేశారు.
యూట్యూబ్లో విడుదలైన లిరికల్ వెర్షన్కే విశేషమైన స్పందన లభిస్తుండగా, థియేటర్ ఎక్స్క్లూజివ్ బిట్ గురించిన సమాచారం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పాటతో 'ది పారడైజ్' సినిమా ప్రమోషన్లకు మరింత ఊపు వచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.