విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు
01 సూర్య భిక్కనూర్ :
నిజామాబాద్ జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి సబ్స్టేషన్ పరిధిలో 3 ఫేస్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆరోపిస్తూ పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఏఈ సంకీర్త్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.