వివేకానందుని సహనం, విశ్వ ఆమోదం సందేశం నేటికీ స్పూర్తిదాయకం
ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఘోర ఉగ్ర దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, 1893 సెప్టెంబర్ 11న చికాగో మత పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. వివేకానందుడు చాటిచెప్పిన సహనం, విశ్వ ఆమోదం మరియు మానవత్వ సందేశం నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా ప్రధాని స్పందిస్తూ.. వివేకానందుని ప్రసంగం భారతదేశ నాగరికతా స్ఫూర్తిని ప్రపంచానికి పరిచయం చేసిందని కొనియాడారు. "సహనం, విశ్వ ఆమోదాన్ని బోధించిన మతానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను" అని నాడు వివేకానంద పేర్కొన్న మాటలను ప్రధాని ఉటంకించారు. మతోన్మాదం, హింస మరియు అసహనం వల్ల ప్రపంచానికి జరిగిన నష్టాన్ని వివేకానందుడు నాడే హెచ్చరించారని, అన్ని మతాల గమ్యం ఒకటేనని చాటారని గుర్తుచేశారు. ఉగ్రవాదం, విద్వేషాలకు ముగింపు పలికేందుకు వివేకానందుని దివ్య సందేశమే మానవాళికి ఆదర్శమని ప్రధాని పేర్కొన్నారు.