BREAKING
అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి ఆచరణాత్మక అభ్యాసానికి గీతం పెద్దపీట అధునాతన మైక్రోకంట్రోలర్లు, మెషిన్ లెర్నింగ్ పై రెండు రోజుల కార్యశాల నిధుల కొరతతో ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లో అయోమయం..! జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి ఎలా వచ్చింది.. ఆగస్త్య మహర్షి పౌరాణిక గాథ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఢిల్లీకి చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్, గ్లోబల్ లీడర్లు యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెన్ షెల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ పెడతామంటే ప్రోత్సాహం లేదా.. అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు భారత్ మండపం వద్ద కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు.. ఏఎంఆర్ గ్రూప్ రుణాల మళ్లింపు గుట్టురట్టు.. తెలుగు మీడియా మౌనంపై ఏబీవీ సంచలన వ్యాఖ్యలు బిఆర్ఎస్ ఎండపల్లి మండలాధ్యక్షుని ఆత్మహత్య గుండు కొట్టించుకుని గడ్డం తీసేసినా దొరికిపోయాడు.. కస్టడీ నుంచి పరారైన డ్రగ్ స్మగ్లర్ అఖిబ్ బషీర్ రీ-అరెస్ట్ బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్ష సూచన 35కు చేరిన మృతుల సంఖ్య న్యూఢిల్లీకి బయలుదేరిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమాషాలాడుతున్నారా.. 12 గంటలు కూర్చోలేకపోతే ఎలా? కలెక్టర్ల సదస్సులో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

నిధుల కొరతతో ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లో అయోమయం..!

Select Suryaa Now
నిధుల కొరతతో ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లో అయోమయం..!

 

అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ? దిక్కుతోచని స్థితిలో కౌన్సిలర్లు.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎదురుచూపులు

శామీర్ పేట, మేజర్ న్యూస్ :

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో నూతనంగా ఏర్పడిన మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి నిధులు అందుబాటులో లేకపోవడంతో కౌన్సిలర్లు అయోమయానికి గురవుతున్నారని తెలుస్తోంది.

తమ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీగా ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు ఊతమివ్వాలని వారు కోరుతున్నారు.

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉండగా, నిధుల లభ్యత లేకపోవడం వల్ల పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి మున్సిపాలిటీకి తగిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.