పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
పాశిగామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మరో కీలక అడుగు వేశారు. విద్యార్థులకు అవసరమైన బెంచీల ఏర్పాటుతో పాటు పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు *ఎంపీ నిధుల నుంచి రూ.18 లక్షలను మంజూరు చేశారు. విద్యార్థులు నేర్చుకునే తరగతి గదులు మెరుగ్గా ఉండాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు కొరత ఉండకూడదనే లక్ష్యంతో విద్యారంగ అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు..పాశిగామ పాఠశాలకు బెంచీలు మాత్రమే కాదు.. సమగ్ర అభివృద్ధికి రూ.18 లక్షలు మంజూరు చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. “విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి రూపాయి సద్వినియోగం.. పాఠశాలల అభివృద్ధే లక్ష్యం” అనే విధంగా ఎంపీ వంశీకృష్ణ చొరవకు స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.