ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి
న్యూఢిల్లీ: భారతదేశ అధ్యక్షతన జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేథ్ ఘన స్వాగతం పలికారు. భారతదేశం, ఈజిప్టుల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధం మరింత బలమైన బ్రిక్స్ భాగస్వామ్యానికి దోహదపడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది.
సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల అగ్రనేతలు హాజరుకానున్నారు. ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై సానుకూల, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.