ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ
న్యూఢిల్లీ:భారతదేశం ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ఘన స్వాగతం పలికారు. భారతదేశం, ఇథియోపియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. 'స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం' అనే ఇతివృత్తంతో "మానవత్వమే ప్రథమం" అనే ప్రజల కేంద్రీకృత విధానంలో ఈ సమావేశాలు సాగనున్నాయి.
గత ఏడాది డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియాలో పర్యటించిన సందర్భంగా ఆయనకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా' ప్రదానం చేసిన విషయాన్ని, ఇరుదేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఈ పర్యటన సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు.