BREAKING
నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు - మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ - అబ్దుల్ అజీజ్‌ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు *అధిక ధరకు అమ్మిన వాటర్ బాటిలు..* *రూ.7 లక్షలు ఫైన్!* ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు బ్రిక్స్ సదస్సులో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ భారతదేశ తీరప్రాంతాన్ని పర్యావరణం, భద్రత, ఆర్థిక సమగ్ర ప్రదేశంగా చూడాలి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ‘నేతన్నల సేవలో’ పథకానికి ఆమోదం పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తి.. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న చిత్రం! ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందిన పోరిక అనిల్ కుమార్

పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి

Select Suryaa Now
పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి

అదనపు కలెక్టర్ దేవ సహాయం
నాగర్‌కర్నూల్: పోషక మాసం లక్ష్యాల సాధనకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు నిర్వహించే పోషణ్ అభియాన్ – పోషక మాసం కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

“హమారీ అంగన్వాడీ–హమారీ భాగ్యదారి” నినాదంతో పోషక మాసం కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మరియు కిశోర బాలికలలో పోషకాహార లోపాలను గుర్తించి వారికి సకాలంలో సమతుల్య ఆహారం అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, రక్తహీనత నివారణకు మరియు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, మున్సిపల్ మరియు మహిళా-శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నాగర్‌కర్నూల్‌ను పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం పోషక మాసం రోజువారీ కార్యక్రమాల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి, అధికారులతో పోషణ్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.