అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మూడూ వంశీకృష్ణ
నర్సంపేట: విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అవినీతి నిర్మూలన, నిజాయితీ మరియు పారదర్శక పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ మూడూ వంశీకృష్ణ మాట్లాడుతూ, విజిలెన్స్ అంటే కేవలం అవినీతిని అరికట్టడమే కాకుండా రోజువారీ జీవితంలో నైతిక విలువలను పాటించడమని పేర్కొన్నారు.
ప్రభుత్వ లేదా బ్యాంకింగ్ సేవల కోసం ఎవరూ అక్రమంగా డబ్బు ఇవ్వకూడదని, లంచం అడిగితే భయపడకుండా అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. పథకాలు, రుణాలు, సబ్సిడీల కోసం మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా అధికారిక మార్గాల ద్వారానే పొం దాలని అవగాహన పరిచారు. అవినీతిని చూసి మౌనంగా ఉండకుండా ప్రశ్నించడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు.
"నేను లంచం ఇవ్వను – తీసుకోను, అవినీతిని ప్రోత్సహించను" అనే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే అవినీతి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.