BREAKING
హైదరాబాద్‌లో హైడ్రా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్.. 1070 ద్వారా ఫిర్యాదుల స్వీకరణ బ్రిక్స్ సమ్మిట్ వేదికగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై దేశాల వ్యూహాత్మక మంతనాలు మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు! జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు! గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ప్రకృతి హితమే పండుగల పరమార్థం.. మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం పాలిటిక్నిక్ లు ప్రైవేటు పరం కావు అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి ఆచరణాత్మక అభ్యాసానికి గీతం పెద్దపీట అధునాతన మైక్రోకంట్రోలర్లు, మెషిన్ లెర్నింగ్ పై రెండు రోజుల కార్యశాల నిధుల కొరతతో ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లో అయోమయం..! జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి ఎలా వచ్చింది.. ఆగస్త్య మహర్షి పౌరాణిక గాథ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఢిల్లీకి చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్, గ్లోబల్ లీడర్లు యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెన్ షెల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ పెడతామంటే ప్రోత్సాహం లేదా.. అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం

Select Suryaa Now
వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం

మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు పిలుపు

ప్రతి భక్తుడికి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు


పులివెందుల, మేజర్ న్యూస్:


పర్యావరణ పరిరక్షణతో పాటు మట్టి సారాన్ని కాపాడే ఉద్దేశంతో పులివెందుల పట్టణంలోని ధరణి క్రాప్ కేర్ ఎరువుల దుకాణం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని నిర్వాహకులు పిలుపుని చ్చారు.మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించవచ్చని తెలిపారు. రసాయనాలతో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులకు కలిగే నష్టాన్ని నివారించేందుకు మట్టి వినాయకులనే ప్రోత్సహించాలని సూచించారు.
ధరణి క్రాప్ కేర్ ఎరువుల దుకాణానికి వచ్చే ప్రతి రైతు, భక్తుడికి మట్టి వినాయక విగ్రహాన్ని ఉచితంగా అందించను న్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో మట్టి వినాయకుడిని పూజించిన అనంతరం నిమజ్జనం రోజున ప్రత్యేకంగా బకెట్‌లో నీటితో విగ్రహాన్ని కరిగించి, అందులోని మట్టిని పొలాల్లో చల్లుకోవచ్చని పేర్కొన్నారు. తద్వారా వినాయకుడి మట్టిని వృథా చేయకుండా భూమికి ఉపయోగపడేలా చేసుకోవచ్చన్నారు.
“మట్టిలో పుట్టిన వినాయకుడు.. మట్టిలోనే కలవాలి. మన భూమి కోసం మన భవిష్యత్తు కోసం మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే సందేశంతో పర్యావరణ హితమైన వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.
ప్రకృతిని కాపాడటం, భూమిని సంపన్నంగా మార్చడం, రైతుకు సుస్థిరమైన సాగును అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని నిర్వాహకులు తెలిపారు. మట్టి వినాయకుడు మన భూమికి మేలని ఆది మన భవిష్యత్తుకు బాట అని పేర్కొన్నారు.


ఫోటో రైటప్ 
1. వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం