BREAKING
సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వివేకానందుని సహనం, విశ్వ ఆమోదం సందేశం నేటికీ స్పూర్తిదాయకం మత్స్య రంగానికి మహర్దశ భవిష్యత్తు విద్యకు బాటలు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు అలుపో ఢిల్లీకి చేరిన రష్యా మంత్రులు లావ్రోవ్, మాంటురోవ్ ఢిల్లీకి చేరుకున్న నైజీరియా విదేశాంగ మంత్రి న్యూఢిల్లీకి చేరుకున్న బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా బ్రిక్స్ సదస్సు భద్రత బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం వినాయక చవితి వేడుకల్లో మట్టి ప్రతిమలకే ప్రాధాన్యం.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేకత! బ్రిక్స్ సదస్సు కోసం న్యూఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

Select Suryaa Now
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్-భోకర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీతాఖండి ఘాట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వాహన శిథిలాల నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఈ విషాద సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ఊరటగా ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.