BREAKING
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..! సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్! జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి ఫార్చునర్ కారులో డ్యూటీకి

విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..!

Select Suryaa Now
విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..!

నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల (సోషల్ వెల్ఫేర్) హాస్టల్‌లో ప్రిన్సిపాల్, వార్డెన్లు కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను పనిమనుషులుగా మార్చి వారిచేత వంట పనులు చేయిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.

హాస్టల్‌లో విద్యార్థులకు భోజనం తయారీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వంట మనుషులను నియమించి, వారికి జీతాలు కూడా చెల్లిస్తోంది. అయినప్పటికీ, నిర్వాహకులు వారి పనిని విద్యార్థులపై రుద్దుతున్నారు. హాస్టల్ విద్యార్థులతో రోజూ బలవంతంగా చపాతీలు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు.

భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు
విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ఉదంతం బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు, పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే ఇలా పనులు చేయించడంపై భగ్గుమంటున్నారు. బాధ్యులైన ప్రిన్సిపాల్, వార్డెన్‌లను తక్షణమే సస్పెండ్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.