వర్షంతో వాహనదారుల అవస్థలు!
ఐటీఓ వద్ద స్థంభించిన ట్రాఫిక్
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రధానంగా ఐటీఓ (ITO) జంక్షన్ వద్ద ఒక వైపు రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఈ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు, బాటసారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.