BREAKING
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..! సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్! జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి ఫార్చునర్ కారులో డ్యూటీకి

జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి

Select Suryaa Now
జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి

జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళిబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన బావమరిది స్వర్గీయ జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.  

జోగినపల్లి శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంపల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించిన దశదిన కర్మ (కర్మకాండలు) కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. అక్కడే ఉన్న శ్రీనివాసరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అనంతరం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కేసీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.