బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు!
కర్ణాటకలోని మండ్యలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఓ వృద్ధురాలు మృతి చెందగా, ఆమె ఇంట్లో తనిఖీ చేయగా భారీగా నగదు బయటపడింది.
మండ్యకు చెందిన హూర్ (68) అనే వృద్ధురాలు జీవితాంతం భిక్షాటన చేస్తూనే కాలం వెళ్లదీసింది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబసభ్యులు ఆమె ఇంలోకి వెళ్లి పరిశీలించగా.. అక్కడ ఉన్న పరిస్థితి చూసి అవాక్కయ్యారు. ఇంట్లో దాదాపు 30కి పైగా సంచుల్లో వేలకొద్దీ నాణేలు, నోట్ల కట్టలు నిల్వ ఉంచి ఉన్నాయి. ఆ డబ్బును లెక్కించగా మొత్తం రూ. 8,40,000 ఉన్నట్లు తేలింది.
అనంతరం ఆ మొత్తంలో నుంచి ఆమె సోదరుల్లో ఒకరు రూ. 6 లక్షలు తీసుకోగా, మిగిలిన డబ్బును కుటుంబసభ్యులు మసీదుకు విరాళంగా అందజేశారు. భిక్షాటన చేస్తూ ఎవరికీ భారంగా మారకుండా బతికిన ఆ వృద్ధురాలు అంత పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవడం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.