కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా
జీతాలు ఇవ్వాలని నిరసన!
సికింద్రాబాద్: కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తమతో పని చేయించుకుంటున్నా జీతాలు చెల్లించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.
బాధిత ఆశా వర్కర్ల ఆవేదన
గతంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తమకు జీతాలు ఇప్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారని, కానీ మూడు నెలలు గడిచినా ఇంతవరకు జీతాలు అందలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని, తమ సమస్యను పరిష్కరించాలని కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.