BREAKING
సీఎం విజయ్ కీలక నిర్ణయాలు మణిపూర్‌లో మీరా పైబీ జ్యోతి ర్యాలీ మహిళల ఆత్మగౌరవంతోనే దేశాభివృద్ధి ‘ఛాత్రోన్ కీ గూంజ్’పై బీజేపీ ఆగ్రహం లండన్ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు ఎంపీ బంపర్ ఆఫర్? దానాపూర్‌లో మునిగిన గ్రామాలు, పాఠశాలలు నాగ్‌పూర్‌లో నీటి శుద్ధి కర్మాగారంలో క్లోరిన్ గ్యాస్ లీక్ కనిజా ఓపెన్ చెస్ విజేతగా భారత్‌కు చెందిన ప్రణేష్ ఉక్రెయిన్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ బులియన్ మార్కెట్‌లో మళ్లీ బంగారం, వెండి జిగేల్ TVK ఇంకా 'ఫ్యాన్ క్లబ్' మైండ్ సెట్‌లోనే ఉంది 22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రధాని మోదీదే

లండన్ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
లండన్ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. లండన్‌లో కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు, క్రీడా మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు సానుకూలంగా సాగాయని సీఎం తెలిపారు.

తొలుత లండన్ నుంచి అమెరికా (బోస్టన్) పర్యటనకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంతో అమెరికా పర్యటన రద్దయింది. దీంతో ఆయన నేరుగా హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.

సీఎం విదేశాంగ పర్యటన నిలిచిపోయినప్పటికీ, తన వెంట వచ్చిన అధికారుల బృందాన్ని అమెరికా పర్యటనకు పంపి, హార్వర్డ్, MIT వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో ఒప్పందాలు (MoUs) పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కేంద్రం అనుమతి నిరాకరించడంపై శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.