BREAKING
TVK ఇంకా 'ఫ్యాన్ క్లబ్' మైండ్ సెట్‌లోనే ఉంది 22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రధాని మోదీదే మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్న ఆన్ సే-యంగ్ హైదరాబాద్‌లో వింత ఘటన: ప్రియురాలికి 'కిడ్నాప్' ప్రాంక్ మెసేజ్.. కట్ చేస్తే రూ. 30 లక్షల బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు! లండన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి పడిక్కల్ ఖాతాలో వరుసగా రెండో సెంచరీ.. తొలి రోజు భారత్ 300/5 నామినేటెడ్ పదవుల్లో పాత నేతలకు 80%, కొత్త వారికి 20% ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మంత్రి పొన్నం భరోసా.. బిసి రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ జిల్లాకే గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ

Select Suryaa Now
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ

బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.

తన కుమార్తె వ్యాఖ్యలు, తనపై వస్తున్న విమర్శలపై ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకిగానీ, గాంధీ కుటుంబానికిగానీ వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కావాలనే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని వెల్లడించినట్లు సమాచారం.

పార్టీలోని అంతర్గత విషయాలు, విభేదాలు ఏవైనా ఉంటే ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం (పీసీసీ) దృష్టికి తీసుకెళ్లాలని, విభేదాలు వీడి సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖకు ఈ సందర్భంగా ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ భేటీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.