TVK ఇంకా 'ఫ్యాన్ క్లబ్' మైండ్ సెట్లోనే ఉంది
మాణికం ఠాగూర్ వ్యాఖ్యలు
కోయంబత్తూరు: తమిళగ వెట్రి కజగం (TVK) నాయకురాలు, మంత్రి జగదీశ్వరి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన ఎంపీ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. టీవీకే నేతలు ఇంకా రాజకీయ పార్టీ పరిణతి సాధించకుండా, "ఫ్యాన్ క్లబ్" (అభిమాన సంఘం) ధోరణిలోనే ఉన్నారని ఆయన విమర్శించారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవారి ఆలోచనలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నారు.
ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతర నేతల అధికారాలను హరించడానికి యత్నిస్తున్నారని, బిజెపికి వ్యతిరేకంగా తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు. TVK విధానాలు, తమ (కాంగ్రెస్) విధానాలు భిన్నమైనవని స్పష్టం చేశారు.
ఇండియా కూటమిలోకి ఆహ్వానంపై స్పష్టత:
ఇండియా (INDIA) కూటమి గురించి మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఈ కూటమిలో 23 రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో TVK తరఫున పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు) ఎన్నికైతే, వారిని కూటమిలోకి ఆహ్వానించే విషయాన్ని పరిశీలిస్తాం. ఎంపీ ప్రాతినిధ్యం లేని పార్టీలను కూటమిలో చేర్చుకోలేము. టీవీకే పార్లమెంట్లో ప్రాతినిధ్యం సాధించిన తర్వాతే ఇండియా కూటమిలో చేరాల్సిందిగా కోరుతాము" అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు.