BREAKING
రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో ప్రత్యేక అలంకరణ నవరాత్రుల తొలిరోజు హరిద్రవర్ణం అలంకరణలో స్వామివారి దర్శనం. అష్ట స్వయంవ్యక్త క్షేత్రం శ్రీమూష్నం.. సర్వరోగాలు నయం చేసే నిత్య పుష్కరిణి, మత సామరస్య విశేషాలు ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన ఇంద్రకీలాద్రిపై కొలువైన అపరాజితా దేవి విశిష్టత.. సర్వకార్య విజయాలను ప్రసాదించే చండీ సప్తశతి స్తోత్రం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు... UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ ​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ: ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ

మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

మట్టి గణపతులనే పూజిద్దాం
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన.
పటాన్ చెరు: వినాయక చవితి సందర్భంగా పటాన్ చెరు నియోజవర్గం ముత్తంగి జిహెచ్ఎంసి డివిజన్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. రాజేష్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.