BREAKING
నేటి విద్యార్థులే రేపటి ప్రజాస్వామ్యానికి వారసులు ఫిన్‌టెక్, ఆటోమేషన్ రంగానికి ఐర్లాండ్ వ్యూహాత్మక కేంద్రం మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ మణిపూర్ సీఎం ఖేమ్‌చంద్ యుమ్నంతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం ఒకే వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాల జారీ 'ఇడుపు కాయితం' సినిమా నుంచి 'శ్రీలత' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల భారీ మొత్తంలో బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు.. రూ. లక్ష కోట్ల సేకరణే లక్ష్యం! ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం! DNHDD ను 'మినీ ఇండియా'గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన.

Select Suryaa Now
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన.

ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన.

ఖమ్మం జిల్లాలోని ఆయిల్‌పామ్ తోటలను సందర్శించిన సంగారెడ్డి జిల్లా రైతులు

సంగారెడ్డి, :-జాతీయ ఆయిల్‌పామ్ మిషన్  లో భాగంగా ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన యాత్రను నిర్వహించారు.సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 30 మంది ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులను గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ సహకారంతో ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని ఆయిల్‌పామ్ తోటల సందర్శనకు తీసుకెళ్లారు.విజ్ఞాన యాత్రలో భాగంగా రైతులు ఆయిల్‌పామ్ తోటలను ప్రత్యక్షంగా సందర్శించి సాగు విధానాలు, మొక్కల పెంపకం, తోటల నిర్వహణ, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్య పద్ధతులు, పంట దిగుబడులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు.ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖిగా మాట్లాడి, వారు అనుసరిస్తున్న సాగు పద్ధతులు, పంట ద్వారా పొందుతున్న ఆర్థిక ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.అదనపు కలెక్టర్  సంగీత జెండా ఊపి విజ్ఞాన యాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్‌పామ్ దీర్ఘకాలికంగా రైతులకు మంచి ఆదాయాన్ని అందించే పంటగా నిలిచే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాంకేతిక సహకారాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు, రైతులు మెరుగైన ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా పంటపై మరింత అవగాహన పొందడంతో పాటు, తమ ప్రాంతంలో సాగు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక అంశాలను తెలుసుకునే అవకాశం లభించిందని జిల్లా ఉద్యాన అధికారి  తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి  సోమేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు, గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.