BREAKING
నేటి విద్యార్థులే రేపటి ప్రజాస్వామ్యానికి వారసులు ఫిన్‌టెక్, ఆటోమేషన్ రంగానికి ఐర్లాండ్ వ్యూహాత్మక కేంద్రం మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ మణిపూర్ సీఎం ఖేమ్‌చంద్ యుమ్నంతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం ఒకే వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాల జారీ 'ఇడుపు కాయితం' సినిమా నుంచి 'శ్రీలత' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల భారీ మొత్తంలో బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు.. రూ. లక్ష కోట్ల సేకరణే లక్ష్యం! ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం! DNHDD ను 'మినీ ఇండియా'గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

Select Suryaa Now
ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్


మెదక్  :  సెప్టెంబర్ 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో  సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న  ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.వేదిక, ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన తాగునీటి సౌకర్యంతోపాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో కలిసి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ గౌరవ వందనం, బందోబస్తు విషయంలో పటిష్ట ఏర్పాట్లు. చేయాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, డిఎఫ్ఓ జోజి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.