తుఫాను ఢీ కొట్టిన ఎక్సైజ్ సీఐ గారు
తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న ఎక్సైజ్ సీఐ కారు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల సబ్ స్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కారు ఎదురుగా ఉన్న తుఫాను బలంగా ఢీకొంది.. సీఐ మద్యం మత్తులో కారు నడిపి తూఫాన్ వాహనాన్ని ఢీకొట్టినట్లు బాధితులు ఆరోపించారు.
ప్రమాద సమయంలో కారు ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో సీఐ రమేష్కు ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతాయుతమైన అధికారే మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే విషయమని బాధితులు పేర్కొన్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సీఐ రమేష్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే విధుల నుంచి తప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.