వినాయక చవితి ను సందర్శించిన చిలకం దంపతులు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ధర్మవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకొని ,ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొత్తపేటలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన వినాయకుడిని, అలాగే సాయినగర్, పార్థసారధి నగర్, శివరాం నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు వినాయక విగ్రహాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి దంపతులు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వంట రమేష్ (తలారి రమేష్), జనసేన నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.