BREAKING
ప్రత్యేక ప్రచారం 6: ఇ-వ్యర్థాల నిర్వహణ, పెండింగ్ పనుల పరిష్కారానికి పోర్టల్ ప్రారంభం గాంధీనగర్‌లో ‘ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026’ ప్రారంభం 2028లో భారత్‌లోకి ఫార్ములా వన్ పునరాగమనం? శరత్‌చంద్ర చటోపాధ్యాయ 150వ జయంతి ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలతో జీవో జారీ! బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు నూతన ఆర్ఐ అశోక్ కు ఎస్పీ శుభాకాంక్షలు కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా… పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం వాడవాడలా వెలసిన గణపయ్యలు యూకే వీసాల మోసం కేసులో యూట్యూబర్ రమానందన విచారణ.. పోలీసుల ముందు విచిత్రమైన డిమాండ్ రైల్వే స్టేషన్ల పేర్ల వెనుక ఆసక్తికరమైన విషయాలు.. జంక్షన్, రోడ్డు, టెర్మినస్‌లకు అర్థం ఇదీ! అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు

Select Suryaa Now
గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు

గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు

ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి

ఎమ్మిగనూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్, ప్రసిద్ధ తేరు బజార్‌లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక  తేరు బజార్ యువ వినాయక మండలి, సందుగుడి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొని గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి మండపాల్లో పుష్పార్చన చేసి, విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ఎమ్మిగనూరు ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. రైతులకు అనుకూల వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారులు, చేనేత కార్మికులు, కార్మికులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.