BREAKING
ప్రత్యేక ప్రచారం 6: ఇ-వ్యర్థాల నిర్వహణ, పెండింగ్ పనుల పరిష్కారానికి పోర్టల్ ప్రారంభం గాంధీనగర్‌లో ‘ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026’ ప్రారంభం 2028లో భారత్‌లోకి ఫార్ములా వన్ పునరాగమనం? శరత్‌చంద్ర చటోపాధ్యాయ 150వ జయంతి ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలతో జీవో జారీ! బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు నూతన ఆర్ఐ అశోక్ కు ఎస్పీ శుభాకాంక్షలు కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా… పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం వాడవాడలా వెలసిన గణపయ్యలు యూకే వీసాల మోసం కేసులో యూట్యూబర్ రమానందన విచారణ.. పోలీసుల ముందు విచిత్రమైన డిమాండ్ రైల్వే స్టేషన్ల పేర్ల వెనుక ఆసక్తికరమైన విషయాలు.. జంక్షన్, రోడ్డు, టెర్మినస్‌లకు అర్థం ఇదీ! అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన

Select Suryaa Now
బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన

 

బషీరాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): గ్రామంలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ సంధ్యా నాయక్ తండా మాజీ సర్పంచ్ శంకర్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆందోళనకు దిగారు.తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, వాటికి సంబంధించిన బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మాజీ సర్పంచ్ ఆందోళనతో కొద్దిసేపు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న బషీరాబాద్ పోలీసులు కార్యాలయానికి చేరుకుని మాజీ సర్పంచ్ శంకర్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించినట్లు సమాచారం.